Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆర్నెల్ల పాలన.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:27 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆర్నెల్ల పాలనపై సీపీఎం ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ 6 నెలల పాలన కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా గడిచింది. 
 
నవరత్నాల హామీల అమలుకు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు కృషి జరిగింది. మంత్రివర్గకూర్పులో సామాజిక న్యాయం పాటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారు.

కాని ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. 
 
ఇసుక పాలసీ అంటూ 5 నెలలపాటు ఇసుక సరఫరా ఆపివేయడంతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడింది. అన్నా కాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బందుకు పడుతున్నారు.

ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదు. మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు. అంతా జగన్ మయం. రాష్ట్రంలో ఏకపక్ష, మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోంది. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి 6 నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలనే మిగిల్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments