Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో 78,322 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:24 IST)
కృష్ణాజిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 78,322 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించామని జిల్లా కలెక్టర్‌ ఏయండి ఇంతియాజ్ అన్నారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఇంతియాజ్ కోవిడ్ ‌వ్యాక్సిన్ రెండవ విడత డోసు వేయించుకున్నారు.

ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. జిల్లాలో 190 సెషన్స్ నిర్వహించడం ద్వారా 78 వేల 322 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసామని తెలిపారు.

జిల్లాలో తొలివిడతగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరిగిందని, రెండవ విడతగా రెవెన్యూ, పంచాయతిరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంద‌న్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైంద‌ని, ప్రజల్లో అపోహలు ఉంటే విడనాడాలన్నారు. బాలింతలు, గర్భిణి స్త్రీలు, పిల్లలు, అలర్జి ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోకూడదని కలెక్టర్ ఇంతియాజ్ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments