Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (13:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజ‌య‌వాడ‌కు చెందిన 28 ఏండ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అలాగే, వైజాగ్‌లో మరో కేసు వెలుగు చూసింది. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కి చేరింది. 
 
ఈ నెల 18న స్వీడ‌న్ నుంచి వ‌చ్చిన అత‌డు ఢిల్లీ మీదుగా విజ‌య‌వాడ‌కు చేరుకున్నాడు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో విజ‌య‌వాడ జీజీహెచ్‌లో చేరాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య‌ శాఖ ప్ర‌త్యేక బులిటెన్ విడుద‌ల చేసింది. 
 
అలాగే, విశాఖకు చెందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తి బంధువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బర్మింగ్‌హమ్‌ నుంచి వచ్చిన వ్యక్తితో లోకల్‌ కాంటాక్ట్‌ అయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
ఈనెల 17న ఆ వ్యక్తి విశాఖపట్నం వచ్చారని 21న ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం చేరారని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 317 మందికి నెగిటివ్‌ రాగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments