Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉన్నవారిని అనుమతించాలి : ఏపీ సర్కారుకు హైకోర్టు

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (13:31 IST)
కరోనా వైరస్ ముప్పు కారణంగా తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తున్న వారిని సరిహద్దుల్లో ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. పైగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. పైగా, లాక్‌డౌన్ సమయంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
కానీ, అనేక మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రజలు తమతమ స్వస్థాలకు వస్తున్నారు. అలాంటి వారిని సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. ఈ చర్యను ఖండిస్తూ జేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)ని ఎంట్రీ పాయింట్లోనే పరిశీలించాలని ఆదేశించింది. ఆరోగ్యపరంగా బాగున్నవారిని అనుమతించాలని చెప్పింది. ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచాలని... ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీ

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments