Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (08:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. గత 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె నిబంధనలు ఉల్లంఘించారంటూ బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ జారీ చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27వ తేదీన ఉషశ్రీ చరణ్‌పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. 
 
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తాహసీల్దారు డీసీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో సెక్షన్ 188 కింద ఉషశ్రీతో పాటు మరో ఏడుగిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు నిందితులు పదేపదే హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments