బిడ్డ ప్రాణాలు కాపాడలేదు.. కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వని ప్రభుత్వాసుపత్రి వైద్యులు

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (16:00 IST)
దేశంలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితి మరింత దయనీయంగా మారుతుంది. మనషుల ప్రాణాలు కాపాడాలేని ఈ ఆస్పత్రులు చివరకు ఆస్పత్రుల్లో చనిపోయిన మృతదేహాలను కూడా తరలించేందుకు కూడా అంబులెన్స్‌లను సమకూర్చలేని దయనీయమైన స్థితిలో ఉన్నాయి. 
 
తాజాగా ప్రభుత్వ ఆస్పత్రిలో చంటి బిడ్డను కోల్పోయిన ఓ తల్లి... బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను సమకూర్చాలని ఆస్పత్రి వైద్యుల కాళ్ళావేళ్లాపడి ప్రార్థించారు. వారు మాత్రం కనికరించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి స్కూటీపైనే 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న  గ్రామానికి బిడ్డ మృతదేహంతో వెళ్లింది. ఈ హృదయ విదాకర ఘటన ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. 
 
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో మృత్యువాతపడిన బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని వైద్యులను తల్లిదండ్రులు ఎంతగానో ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. దీంతో బిడ్డ మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకుని స్కూటీపై 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకి ఆ దంపతులు పుట్టెడు దుఃఖంలో ప్రయాణించారు. కేజీహెచ్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయామని ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments