Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం : ఏడడుగుల వేడుకకు ఏడుగురు అతిథులు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:59 IST)
పెళ్లంటే నూరెళ్లపంట. జీవితంలో అత్యంత మధురమైన ఈ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగిన విధంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటి పెళ్లిని కేవలం ఏడుగురు అతిథిల సమక్షంలో పూర్తికానిచ్చారు. ఈ వివాహ వేడుక విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం గరవపాలెం అనే గ్రామంలో. దీనికి కారణం కరోనా వైరస్ భయంతో పాటు కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమల్లోవుండటమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గవరపాలెం తాకాశి వీధికి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తికి ఏప్రిల్ 9వ తేదీ గురువారం వివాహం జరిపేలా గతంలోనే పెద్దలు నిశ్చయంచారు. సొంతూర్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని భారీ కల్యాణ మండపం బుక్‌ చేసుకోవడమేకాక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
ఈలోగా ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు ఆశలు అడియాశలయ్యాయి. పోలీసుల నిబంధన కారణంగా మండపంలో పెళ్లికే వీలుకాని పరిస్థితి.
 
అలాగని వివాహాన్ని వాయిదా వేసుకునేందుకు ఉభయ కుటుంబాలు ఇష్టపడక పోవడంతో నిరాడంబరంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ వివాహ వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మరో ముఖ్యమైన ఏడుగురు అతిథులు మాత్రమే హాజరు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments