Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేపే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:50 IST)
ఏపీలో ఈ నెల పదిన జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్లను ఆదివారం లెక్కించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రక్రియ ప్రారంభమై సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 75 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు గత బుధవారం పోలింగ్‌ జరిగింది.

అయితే, కోర్టు ఉత్తర్వులున్న ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాల్టీల ఫలితాలను మాత్రం ప్రకటించడం లేదని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపుపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి దాటే వరకు లెక్కింపు జరగడం వల్ల ఎన్నో ఇబ్బందులొచ్చా యని, అందువల్ల ఈసారి సాయంత్రంలోపు లెక్కింపు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది.

ఈ మేరకు జిల్లాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఆదివారం ఉదయం అభ్యర్థులు, వారి తరుఫు ఏజెంట్లు 14న ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్‌ ప్రాంతానికి హాజరు కావాలని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు.

ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఏడు గంటలకు బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ ఓపెన్‌ చేస్తామన్నారు. ఫలితాలు వచ్చాక ఈ నెల 18న మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులిచ్చింది. మేయర్‌ ఎన్నికకు ప్రిసైడింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్లు ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments