Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల వ్యవధిలో 21,954 కేసులు

Webdunia
గురువారం, 6 మే 2021 (22:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 1,10,147 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 21,954 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,28,186కు పెరిగాయి. 
 
రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది వరుసగా నాలుగోరోజు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహమ్మారి ధాటికి మరో 72 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 8,446కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 10,141 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3,531 కేసులు వెలుగులోకి వచ్చాయి. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 548 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
ఇక విశాఖలో ఒక రోజు వ్యవధిలో అత్యధికంగా 11 మంది మరణించగా.. తూర్పుగోదావరిలో 9 మంది, విజయనగరంలో 9 మంది, అనంతపురంలో 8 మందిని మహమ్మారి కబళించడంతో కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments