Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 6 మే 2021 (22:34 IST)
మద్యానికి బదులుగా ఆల్కహాల్ కలగలిసిన హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మరణించిన విషాద ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. ఇదే ఘటనలో మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. 
 
సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో జరిగిందీ ఘటన. ఏడుగురిలో నలుగురు మంగళవారం రాత్రి తమ ఇంట్లోనే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
 
కమలేశ్ ధురి (32), అక్షయ్ ధురి (21), రాజేశ్ ధురి (21), సమ్రు ధురి (25) కలిసి మంగళవారం రాత్రి 91 శాతం ఆల్కహాల్ ఉండే డ్రోసెరా-30 అనే హోమియోపతి సిరప్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు 
 
గ్రామంలోని ఓ హోమియోపతి ప్రాక్టీషనర్ వారికి ఆ సిరప్ ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు దానిని మద్యానికి బదులుగా తాగినట్టు తెలుస్తోందని, అయితే మరణానికి కచ్చితమైన కారణం తెలియదని ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments