Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 6 మే 2021 (22:34 IST)
మద్యానికి బదులుగా ఆల్కహాల్ కలగలిసిన హోమియోపతి మందులు వేసుకున్న ఏడుగురు మరణించిన విషాద ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. ఇదే ఘటనలో మరో ఐదుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. 
 
సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో జరిగిందీ ఘటన. ఏడుగురిలో నలుగురు మంగళవారం రాత్రి తమ ఇంట్లోనే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
 
కమలేశ్ ధురి (32), అక్షయ్ ధురి (21), రాజేశ్ ధురి (21), సమ్రు ధురి (25) కలిసి మంగళవారం రాత్రి 91 శాతం ఆల్కహాల్ ఉండే డ్రోసెరా-30 అనే హోమియోపతి సిరప్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు 
 
గ్రామంలోని ఓ హోమియోపతి ప్రాక్టీషనర్ వారికి ఆ సిరప్ ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు దానిని మద్యానికి బదులుగా తాగినట్టు తెలుస్తోందని, అయితే మరణానికి కచ్చితమైన కారణం తెలియదని ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments