Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఉధృతం.. 199మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (15:21 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. కరోనా నియంత్రణకై ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. జూన్ ఫస్ట్ నుంచి కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,718కు చేరుకుంది. ఆదివారం మొత్తం 17,695 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే.. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 130 మందికి.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 69మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా కొత్తగా ఇద్దరు కరోనా మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 75మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల్లో 17,695 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 199 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు. వారిలో 130 మంది ఏపీకి చెందినవారు కాగా, 69 మంది ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు. 30 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments