Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు రద్దు

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (15:43 IST)
కరోనా మమహమ్మారి కారణంగా రాష్ట్రంలో పలు ఆలయాలు మూతబడ్డాయి. కేంద్ర  ప్రభుత్వం అన్లాక్ సడలింపులతో ఇప్పుడిప్పుడే కొన్ని ఆలయాలు దర్శనాలకు నోచుకుంటున్నాయి. కానీ కరోనా మహమ్మారి దేవాలయాలను సైతం వదలడం లేదు. ఆలయాలలో కరోనా కేసులు రావడంతో ఒక్కో ఆలయం తాత్కాలకంగా దర్శనాలను సైతం నిలిపివేస్తున్నాయి.
 
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కరోనా కేసులు కలకలం రేపాయి. అంతర్వేది ఆలయంలో సేవలు అందించే నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో దేవాలయంలో దర్శనాలు రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో నేడు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
 
ఆలయంలో కరోనా కేసులు రావడం ఇది రెండోసారి. కేశ ఖండన సిబ్బందికి కరోనా రావడంతో ఇటీవల ఆ సేవలను కూడా రద్దు చేశారు. దీంతో ఆలయ పరిసరాలను శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో అంతర్వేది రథాన్ని తగులబెట్టడంతో  పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై హిందూ దార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
 
ఆపై కొత్త రథాన్ని రూపొందించి పనులు కొనసాగిస్తున్నారు. తర్వాతి కాలంలో భక్తులు ఎక్కువ రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

పుష్ప జాతర సీన్ కు మించి కొత్తపల్లిలోఒకప్పుడు చిత్రంలో వుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

సుబోధ్ భావే తో ఆదిత్య ఓం తెరకెక్కించిన సంత్ తుకారాం సిద్ధమైంది

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments