Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో కరోనా కలకలం.. 24 గంటల్లో ఏపీలో 70 కేసులు

Webdunia
శనివారం, 30 మే 2020 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కరోనా కేసు నమోదైంది. ఇప్పటికే ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2874కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

792మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే 2092 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 406మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
ఈ నేపథ్యంలో అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు.. గత రెండు రోజులుగా అతనితో కలిసి తిరిగినవారు, సికింద్రాబాద్‌ నుండి బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments