Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు.. 41 మంది మృతి

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (18:46 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. 24 గంటల వ్యవధిలో ఏపీలో 6751 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700235కు చేరింది. అలాగే, రాష్ట్రంలో 24 గంటల్లో 41 మంది కరోనాతో మృతి చెందారు. 
 
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 986 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 888, ప్రకాశం 783, పశ్చిమ గోదావరి 753, గుంటూరు 594, నెల్లూరు 472, కృష్ణా 424, కడప 400, అనంతపురం 333, శ్రీకాకుళం 301, విశాఖపట్నం 277, విజయనగరం 275, కర్నూలు 265 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700235 కాగా, వారిలో 636508 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 57858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7297 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో ఏపీలో 71,577 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 58,78,135 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
 
తెలంగాణలో ఇప్పటి వరకు 1,93,600 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క సెప్టెంబరు నెలలో మొత్తం 65,903 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 68,247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంటే కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1135 మరణించగా.. ఒక్క సెప్టెంబరు నెలలోనే 299 కరోనాతో మృతి చెందారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments