Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరెస్ ఎఫెక్ట్, ఆర్థిక సంక్షోభంలో అన్నవరం సత్యదేవుని దేవస్థానం

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (16:19 IST)
కరోనా ఎఫెక్ట్ సత్యదేవునిపై పడింది. అన్నవరం ఆదాయం సన్నగిల్లింది. కనీసం అద్యోగులు, సిబ్బందికి పూర్తిస్థాయి జీతాలు ఇవ్వలేక పోతున్నాయి. భక్తులు రాక ఆదాయం లేక ఆలయ నిర్వహణ కష్టతరంగా మారింది. మరీ ఆలయానికి ఆర్థిక సంక్షోభం తీరేదెలా అనే ఆలోచనలో అధికారులు సతమతమవుతున్నారు.
 
సామూహిక సత్యనారాయణ వ్రతాలు, రత్నగిరి రూమ్‌ల అద్దెలు, దర్శనాల టికెట్లు, ప్రసాదాల అమ్మకాలు  మరియు హుండీ ద్వారా ఆదాయాలు మెండుగా వచ్చేవి. ప్రస్తుతం కరోనా కారణం వల్ల అది సంక్షోభంగా మారింది. ప్రతి రోజు 25 నుంచి 35 లక్షల మధ్య ఆదాయం వచ్చేది. అది ప్రస్తుతం 3 లక్షలకే పరిమితమయ్యాయి. ఇప్పుడున్న ఆదాయం ఆలయ నిర్వహణకు సరిపోవడం లేదు.
 
ఆలయంలో రెగ్యులర్, పొరుగు సేవలు కింద 720 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ లెక్కలకు తీసుకుంటే దాదాపు నెలకు 3 కోట్లు అవుతుంది. ఇటీవల సత్యదేవుని దర్శనం కోసం దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చారు. ఉద్యోగులు తమకు పూర్తి స్థాయిలో జీతమివ్వాలని కోరగా మంత్రి ఈవోను నిలదీసారు.
 
దీంతో స్వామివారి మీద ఉన్న డిపాజిట్లను విత్ డ్రా చేస్తే అందరికి పూర్తి జీతాలు ఇవ్వగలుగుతామని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయాలని ఈవోకు తెలిపారు. అయితే ఈ విషయంపై కమిషనర్ ఎలాంటి ఆదేశాలు ఇస్తారో అని అధికారులు, సిబ్బంధి  ఎదురుచూస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments