మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:57 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన వెల్లడించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, అందువల్ల తనను కలసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
అదేసమయంలో ప్రస్తుతం తానిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇపుడు ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్సను పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 
 
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, సోమిరెడ్డి గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది. 
 
కాగా, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీనియర్ నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. ఈయన పార్టీకి, కార్యకర్తలకు ఎంతో అండగా ఉంటున్నారు. ఇపుడు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments