Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:57 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన వెల్లడించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, అందువల్ల తనను కలసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
అదేసమయంలో ప్రస్తుతం తానిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇపుడు ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్సను పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 
 
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, సోమిరెడ్డి గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది. 
 
కాగా, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీనియర్ నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. ఈయన పార్టీకి, కార్యకర్తలకు ఎంతో అండగా ఉంటున్నారు. ఇపుడు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments