Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:57 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన వెల్లడించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, అందువల్ల తనను కలసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
అదేసమయంలో ప్రస్తుతం తానిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇపుడు ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్సను పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 
 
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, సోమిరెడ్డి గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది. 
 
కాగా, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీనియర్ నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. ఈయన పార్టీకి, కార్యకర్తలకు ఎంతో అండగా ఉంటున్నారు. ఇపుడు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments