Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 6045 కేసులు.. 65 మరణాలు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (17:56 IST)
ఏపీలో కరోనా చెలరేగిపోతోంది. మృత్యు ఘంటికలు మోగిస్తూ రికార్డు స్థాయిలో ప్రాణాలను బలితీసుకుంటోంది. బుధవారం అత్యధికంగా 65 మంది కరోనాకు బలయ్యారు. 6045 మంది కరోనా బారిన పడ్డారు.

రాష్ట్రంలో వైరస్‌ విలయం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మొన్నటి వరకు 1 శాతం కంటే తక్కువ ఉన్న మరణాల శాతం నెమ్మదిగా 1.25 శాతానికి పెరిగింది.

తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1049, తూర్పుగోదావరిలో 891, గుంటూరులో 842, కర్నూలులో 678, పశ్చిమగోదావరిలో 672, చిత్తూరులో 345,  అనంతపురంలో 325, కృష్ణాలో 151, కడపలో 229, శ్రీకాకుళంలో 252,  ప్రకాశంలో 177, విజయనగరంలో 107, నెల్లూరుజిల్లాల్లో 327 మందికి పాజటివ్‌ వచ్చింది. 
 
భారత్‌లో...
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,92,915కు చేరింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరటనిస్తోంది.

దేశంలో ప్రస్తుతం 4,11,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసిఎంఆర్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments