Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా ఉధృతి.. 88కి చేరిన మృతుల సంఖ్య.. 264మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (11:06 IST)
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 264 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,720కి చేరింది. మంగళవారం చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 88మందికి పాజిటివ్‌ అని తేలింది. కృష్ణాజిల్లాలో మరో 42మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1022కి చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మరో 41కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ముగ్గురు నర్సులు కరోనా బారిన పడ్డారు. అనంతపురం జిల్లాలో 28మందికి పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 56చొప్పున, తూర్పుగోదావరిలో 16, నెల్లూరులో 5కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో 10,667 కేసులు నమోదయ్యాయని 380మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం 9,900 మరణాలతో ప్రపంచ జాబితాలో భారత్‌ 8వ స్థానానికి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments