Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి ఆగమనం... చిరు జల్లులు పడే ఛాన్స్

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వీటి ప్రభావం కారణంగా చిరు జల్లులు పడే అవకాం ఉంది. శ్రీహరికోట సమీప ప్రాంతాలపై ఈ రుతుపవనాలు విస్తరించినవున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. ఈ ప్రభావం కారణంగా చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఏపీలోని శ్రీహరికోటతోపాటు కర్నాటక, తమిళనాడు, ధర్మపురి, శివమొగ్గ, రత్నగిరి, హాసన్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించే అనువైన పరిస్థితులు ఉన్నట్టు తెలిపారు. రాగల 24 గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైుపు, ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments