Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మౌన ప్రదర్శన

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (17:22 IST)
బిజెపి ప్రభుత్వ  విధానాలకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో మౌన ప్రదర్శన నిర్వహించింది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ మౌన ప్రదర్శన లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నాయకులు కాంగ్రెస్ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాపరెడ్డి, రాష్ట్ర మైనారిటీ చైర్మన్ దాదా గాంధీలు ఏర్పాటు చేసిన కార్యక్ర్రమంలో ఆయన పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కుల, మతతత్వ రాజకీయాలతో ప్రజలను వంచనకు గురిచేస్తున్నదనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు.
 
 బాధ్యతాయుతమైన పార్టీలో సభ్యులుగా వున్న మనమందరం మొదటినుంచీ బిజెపి ప్రభుత్వం యొక్క కుటిల రాజకీయ ఎత్తుగడలను ప్రజల ముందుంచుతూ ప్రజా క్షేత్రంలో బిజెపి దిగజారుడుతనాన్ని బట్టబయలు చేస్తూనే వున్నామని, దేశాన్ని, దేశ సంపదను అమ్మకానికి పెడుతూ రాజకీయ మనుగడను కాపాడుకోవడానికి బిజెపి ప్రభుత్వం చేయని కుతంత్రాలు లేవన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలకు నిజాలు తెలియకుండా మతం పేరిట మారణహోమాలు  సృష్టిస్తున్నారన్నారని డాక్టర్ సాకే శైలాజనాథ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments