Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (11:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పార్టీ ప్రతినిధి జీవీ రెడ్డి ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం సాయంత్రం ఇక్కడ తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకొన్నారు. తనను చేర్చుకొన్నందుకు చంద్రబాబుకు జీవీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  
 
క్రీయాశీలక పార్టీలో చేరాలనే నిర్ణయంతో టీడీపీలో చేరినట్లు జీవిరెడ్డి తెలిపారు. తనను చేర్చుకున్నందుకు చంద్రబాబుకు జీవీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి మరింత నష్టం చేకూరవద్దంటే చంద్రబాబును బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. 
 
విజన్ లేకుండా నిధులు పప్పు బెల్లాలు పంచినట్టు పంచితే భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే.. జగన్ వినాశనం కోరుకునే వ్యక్తి అని విమర్శించారు. కొన్ని వర్గాలు చంద్రబాబుపై అకారణంగా ద్వేషం పెంచుకోవడం వల్ల రాష్ట్రం నాశనమైందని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments