Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసుల చిట్టా రాసి పెట్టండి... అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూద్దాం!

పోలీసుల చిట్టా రాసి పెట్టండి... అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూద్దాం!
విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (10:27 IST)
వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్షలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి  టీడీపీ నాయకులు, కార్యకర్తల పై భౌతిక దాడులు చేసి, ఆర్దిక మూలాలు దెబ్బతీసినా టీడీపీ శ్రేణులు భయపడకుండా  వైసీపీ అరాచకాలపై పోరాడుతున్నార‌న్నారు. వైసీపీ అరాచక, అవినీతి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి జాతీయ చంద్రబాబు ఇంటిపై దాడి చేసినా దైర్యంగా ఎదుర్కొన్నామ‌న్నారు. నేడు వైసీపీ రౌడీ మూకలు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డార‌ని, వైసీపీ డ్రగ్స్, అక్రమ వ్యాపారాలపై పట్టాభిరాం ప్రశ్నిస్తే వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై ఆపీసుపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడు జరగ లేద‌న్నారు. 
 
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయ‌ని, ఇది వాస్తవం కాదా? ఈ విషయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులు సైతం చెబుతున్నార‌న్నారు. మీ తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?   వైసీపీ అరాచకాలను దేశానికి తెలిజేయాలని  ఈ 36 గంటల దీక్ష చేస్తున్నాం అని చెప్పారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా  విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు టీడీపీ నివాళి అర్పిస్తోంద‌ని తెలిపారు. రాష్ట్రంలోని డీజీపీ, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో  అమరులైన పోలీసుల ఆత్మ ఘోషిస్తోంద‌న్నారు. ఇలాంటి పోలీసు వ్యవస్ధను దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేద‌ని, గూండాలు, రౌడీలతో కొంతమంది పోలీసులు కమ్మక్కయ్యార‌ని ఆరోపించారు. డీజీపీ ఆపీసుకు కూతవేటు దూరంలో దాడి జరిగితే, కనీసం డీజీపీ స్పందించలేదు, పోలీసుల పనితీరుపై ప్రజలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నార‌ని చెప్పారు.
 
ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చాలి, చీపుర్లలతో కొట్టాలని జగన్  అనలేదా? అని ప్ర‌శ్నించారు. టీడీపీని భూస్ధాపితం చేయాలని జగన్ అనుకుంటున్నార‌ని, అది జగన్ తండ్రి తాత వల్లే కాలేద‌ని, ఇక జగన్ వల్లే ఏమవుతుంద‌ని ఎద్దేవా చేశారు. పట్టాభి ఇంటిపై దాడి చేసి 48 గంటలు గడిచినా ఇంతవరకు ఒక్కరిని అరెస్టు చేయని పోలీసులు పట్టాభినే అరెస్టు చేశారంటే ఈ డీజీపీ, పోలీసులు ఎంత దిగజారారో అర్దమౌతోంద‌న్నారు. టీడీపీ కార్యాలయంపై దాడికి చేసిన రౌడీ మూకల్ని పోలీసులే సాదరంగా సాగనంపార‌ని, టీడీపీ కార్యాయలంలో పట్టుబడ్డ పోలీసును కాపాడినందుకు. తిరిగి టీడీపీ నేతలపైనే  హత్యయత్నం కేసులు పెట్టార‌ని, డీజీపీ దారుణంగా వ్యవహరిస్తున్నార‌ని విమ‌ర్శించారు. 
 
పోలీసులూ ఖబడ్డార్... మీ చిట్టాలన్నీ రాస్తున్నాం..... రిటైర్ అయి, లేదా  వేరే చోటికి వెళ్లి పోవచ్చనుకుంటున్నారేమో - రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడున్నా వదలం. మెగుడిని కొట్టి మెగసాలకు ఎక్కినట్టు వైసీపీ వైఖరి ఉంది,  మేం బంద్ కి పిలుపునిస్తే వాళ్లు నిరసనలకు పిలుపునిచ్చారు. మేం దీక్ష చేస్తుంటే..వైసీపీ పోటీగా ప్రజాగ్రహ దీక్ష చేస్తుంది.... దేశంలో అత్యదిక ప్రజాగ్రహం ఉన్న ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలలో జగన్ , వైసీపీ ఎమ్మెల్యేలు మెదటి స్దానంలో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఫ్రీడ్రగ్ స్టేట్ గా రూపొందించే వరకూ లోకేష్ ఆద్వర్యంలో పోరాడుతాం. టీడీపీ కార్య‌క‌ర్త‌ల్ని ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతలు, పోలీసులు, అధికారుల చిట్టా రాసి పెట్టండి...అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూద్దాం అని అచ్చెన్నాయుడు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషికి పంది కిడ్నీ : ఆపరేషన్ సక్సెస్.. ఎక్కడ?