Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిలెక్కనున్న సబ్బం హరి... చంద్రబాబుతో రహస్య మంతనాలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి త్వరలోనే సైకిలెక్కనున్నారు. ఇందుకోసం ఆయన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (12:44 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి త్వరలోనే సైకిలెక్కనున్నారు. ఇందుకోసం ఆయన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.
 
ఆయన తన అనుచరులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సబ్బం హరిని తొలుత అభిమానులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సబ్బం హరి మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం, అనుచరులు, అభిమానుల సూచన మేరకు త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని తెలిపారు. 
 
అంతేకాకుండా, క్రమశిక్షణ, అభివృద్ధి, ప్రజోపయోగం లక్ష్యాలుగా తాను రాజకీయ పదవులు నిర్వహించానని, భవిష్యత్తులోనూ అదే ఉద్దేశంతో తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. మేయర్‌గా నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశానని, శివాజీపాలెం డంపింగ్‌ యార్డును తరలించి అక్కడ పార్క్‌ అభివృద్ధి ఇందుకు ఓ ఉదాహరణ అని తెలిపారు. 
 
కాగా, రాష్ట్ర విభజన తర్వాత సబ్బం హరి క్రియాశీలక రాజకీయాలకు దూరమైన విషయం తెల్సిందే. కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన స్నేహం మెలుగుతున్నారు. నిజానికి ఈయన వైకాపాలో చేరుతారని గతంలో ప్రచారం జోరుగా సాగినప్పటికీ.. ఆయన జగన్ చెంతకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments