Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు' పూర్తి చేయండి: మంత్రి కురసాల కన్నబాబు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:10 IST)
రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు వ్యవసాయ, అనుబంధ సేవలు అందించడమే ప్రధాన అజెండగా పనిచేయాలని అధికారులను మంత్రి కుర‌సాల కన్నబాబు ఆదేశించారు.

వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు, ఆగ్రోస్ ఎండీ బాలాజీ పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు అందిస్తున్న సేవలపై మంత్రి ఆరా తీశారు.

నెల్లూరు జిల్లాలో పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి కన్నబాబు ఆదేశించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో సానుకూలంగా స్పందించాలని సూచించారు.

ఈ క్రాప్ బుకింగ్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనపై జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్‌ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు నిర్ణీత సమయంలో పూర్తి చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments