Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మొత్తం 80మంది, ధ్యావుడా?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (21:54 IST)
తిరుమలలో నూతనంగా ప్రభుత్వం నియమించిన జంబో పాలకమండలిపై సర్వత్రా విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులు 24 మంది అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 56 మందిని ప్రభుత్వం నియమించింది.
 
నామినేటెడ్ పోస్టులు దొరకని వారందరికీ తిరుమలను పునరావాస కేంద్రంగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు, స్థానిక బిజెపి నేతలు మండిపడుతున్నారు. పూర్తిగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఈరోజు ఏకంగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. పాలకమండలి సభ్యుల నియామకం సరైంది కాదన్నారు. అయితే ప్రభుత్వం నియమించిన సభ్యులు మాత్రం ఒక్కొక్కరు.. ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం విమర్సలను పట్టించుకోకుండా జంబో పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం విమర్సలకు తావిస్తోంది.
 
ఇప్పటికే సుమారుగా 15 మందికి పైగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన వారు ప్రతిరోజు ఇద్దరేసి చొప్పున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ లెక్కన 80 మంది సభ్యులకు 80 మంది అటెండర్లు, 80 ఆఫీసులు, 80 టిటిడి కార్లు.. 80 మందికి ప్రతిరోజు ప్రత్యేక ప్రవేశా దర్సనా టిక్కెట్ల కేటాయింపు.
 
ఇలా ఈ సభ్యులకు టిక్కెట్లన్నీ ఇచ్చేస్తే ఇక సాధారణ భక్తుల పరిస్థితి ఏంటని టిటిడి ప్రశ్నిస్తోంది. ఇన్ని విమర్సలు వస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరికదా విమర్సలను పూర్తిగా పక్కనబెట్టేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments