Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్‌

అమరావతి : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే పరిణామానికి అడుగులు పడుతున్నాయి. సింగపూర్‌, మలేషియా తదితర దేశాలకు దగ్గరగా ఏపీ ఉండటం, రాష్ట్రానికి పొడవైన తీరం ఉండటంతో సముద్ర రవాణాకు ఏపీ అత్యంత కీలక ప్రాంతంగా ఉంది. దీంతో, దేశంలోని తూర్పుతీర ప్రాంతంలో ఏర్

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (15:18 IST)
అమరావతి : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే పరిణామానికి అడుగులు పడుతున్నాయి. సింగపూర్‌, మలేషియా తదితర దేశాలకు దగ్గరగా ఏపీ ఉండటం, రాష్ట్రానికి పొడవైన తీరం ఉండటంతో సముద్ర రవాణాకు ఏపీ అత్యంత కీలక ప్రాంతంగా ఉంది. దీంతో, దేశంలోని తూర్పుతీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్‌కు కూడా రాష్ట్రమే కీలకం కానుంది. ఈ జోన్‌ను అటు ఒడిసా నుంచి ఏపీ వరకూ, లేకుంటే ఏపీ నుంచి చెన్నై వరకూ ఎటు ఏర్పాటు చేసినా ఏపీ భాగస్వామ్యం అనివార్యం.
 
ఈ జోన్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. దీనికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా ఈరోజు విజయవాడ గేట్ వే హోటల్‌కు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఒక ప్రజెంటేషన్‌ను పనగారియా ఇవ్వనున్నారు. 
 
తీరప్రాంత జోన్‌ ఏర్పాటుకోసం రాష్ట్రం చేయాల్సిన పనులేంటి? కేంద్ర సాయం తదితర అంశాలపై చర్చలుంటాయి. తీరప్రాంతంలో పరిశ్రమలకు అవసరమైన రాయితీలు ఇచ్చి వాటి ఉత్పత్తులను ఎగుమతి చేసే ఆలోచనతో ప్రభుత్వాలున్నాయి. వీటన్నింటికీ కార్యరూపం ఇచ్చే దిశగా సీఎంతో పనగారియా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments