Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై జయరామ్ అనుమానాస్పద మృతి.. ఈయనే కోస్టల్ బ్యాంకు ఫౌండర్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:37 IST)
ఎన్నారై జయరామ్‌గా, కోస్టల్ బ్యాంకు ఛైర్మన్‌గా ప్రతి ఒక్కరికీ సుపరిచితుడైన చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కీసరకు సమీపంలో ఐతవరం గ్రామ జాతీయరహదారి పక్కన ముళ్ళ పొదల్లో ఉన్న కారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివశిస్తున్నారు. కోస్టల్ బ్యాంకు డైరెక్టర్‌గా, హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీగా జయరామ్ పనిచేస్తున్నారు. జయరామ్ కొన్ని రోజులు ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్‌గా పని చేయగా, ఈ టీవీని ఒక యేడాది క్రితం మూసివేశారు. జయరామ్ కుటుంబం అమెరికాలో నివాసం ఉంటుంది. హత్యకు ఆర్థికపరమైన వివాదాలు కారణమై ఉంటాయని పోలీసుల అనుమానిస్తున్నారు. 
 
రెండు రోజుల క్రితం జయరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో మరో వ్యక్తితో కలిసి వెళ్లినట్లు తెలిసింది. అయితే, తలపై బలమైన గాయాలు ఉండటంతో ఆయన్ను కొట్టి చంపారా లేదా ప్రమాదవశాత్తు చనిపోయారా అన్నది తెలియాల్సి వుంది. కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కనూరులో జయరామ్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ఈయనకో అమెరికాతో పాటు.. హైదరాబాద్‌లో పలు కంపెనీలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments