Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. సూర్యతాపం కారణంగా పగటి పూటేకాకుండా రాత్రి సమయాల్లో కూడా వేడి వాతావరణం కొనసాగుతుంది. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తల్లడిల్లిపోతున్నారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ఎండ, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీనికితోడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
మరోవైపు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్రంలోని 433 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది. 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. 
 
రానున్న రెండు రోజులు కోస్తాలో వడకాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 11వ తేదీ వరకు కోస్తాలో ఎండలు కొనసాగుతాయని వాతావణ శాఖ తెలిపింది. అయితే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments