Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్ నడిపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (17:15 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం ట్రాక్టర్ నడిపారు. ఈ ఆసక్తికర దృశ్యం గుంటూరు జిల్లా చుట్టగుంట ప్రాంతంలో కనిపించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాన్ని రైతుల కోసం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 
 
ఈ సందర్భంగా రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాలను ఆయన జెండా ఊపి పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఆయన ఒక రైతు గ్రూపుతో కలిసి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఆ సమయంలో ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
 
ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 3800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాలను పంపిణీ చేశారు. అలాగే, 5262 రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సీడీని సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments