Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:27 IST)
సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రోబెషన్ ను అమలు చేస్తామని ఇప్పటికే సీఎం వైయస్ జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
 
సచివాలయాల్లో ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని, వారి పనితీరును గమనించిన సీఎం జగన్ వారికి జూన్ నెలలో ప్రోబెషన్ డిక్లేర్ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు. 
 
సచివాలయ ఉద్యోగుల గురించి తమకే బాధ్యత ఉన్నట్లుగా, తమ హయాంలో ఉద్యోగాలు ఇచ్చినట్లు టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. దీనిపై తెలుగుదేశం అతిగా స్పందించాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
 
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ ముందుచూపుతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకకాలంలో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా సీఎంకే దక్కుతుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments