Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నవరం మహిళ సమస్యను పరిష్కారానికి సీఎం ఆదేశం

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (10:05 IST)
కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన ఆరుద్ర అనే మహిళ సమస్య పరిష్కారనికి అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను వీల్‌చైర్‌తో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మీడియాలో వైరల్ అయింది. 
 
దీంతో సీఎం స్పందించారు. ఆమె సమస్యలు పరిష్కారించాలంటూ అధికారులను ఆదేశించారు. అధికారులకు ఆమెకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు ఆరుద్రను ప్రత్యేక అంబులెన్స్‌లో తాడేపల్లి క్యాంపు క్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆమెతో సీఎం ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి మాట్లాడి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తమ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా హామీ ఇచ్చిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తెకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారని, తన ఇంటిని అమ్ముకునేందుకు అడ్డుపడుతున్న పోలీస్ కానిస్టేబుళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా భరోసా ఇచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments