Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఛాంబర్ చూస్తే షాకవ్వాల్సిందే.. గోడలపై ఏమున్నాయంటే...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (12:54 IST)
వైకాపా అధినేత, నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం సచివాలయంలోకి అడుగుపెట్టారు. గత నెల 30వ తేదీన నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. ఇప్పటివరకు సచివాలయంలో అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8.39 నిమిషాలకు ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు.
 
అయితే, ఈ ఛాంబర్‌లోకి వెళ్లిన వైకాపా అగ్రనేతలతో పాటు.. అధికారులకు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఛాంబర్‌లోని నాలుగు గోడలకు తన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను అందమైన చిత్రాలుగా మలిచి గోడలకు అంటించారు. తాను కూర్చొనే సీటుకు కుడివైపున తన తండ్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు.
 
తన ఛాంబర్‌లో పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అందమైన చిత్రాల రూపంలో మలిచి నాలుగు గోడలకు అంటించడంలో ఆంతర్యం లేకపోలేదు. ప్రతీక్షణం ఎన్నికల హామీలను గుర్తించుకుని పని చేయడానికి ఇలా చేసినట్టుగా చెప్పకనే చెబుతున్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడగా, జగన్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments