Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూటుకోటు ధరించి న్యూ గెటప్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్

Webdunia
ఆదివారం, 22 మే 2022 (20:28 IST)
దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కొత్త గెటప్‌లో కనిపించారు. సూటు, కోటు ధరించి టిప్‌టాప్‌గా రెఢీ అయ్యారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఇందులో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందానికి సీఎం జగన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై సీఎం జగన్ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. 
 
కాగా, సీఎం జగన్ తొలి రోజున బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన ఆయన వరుసగా అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా, బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్ బక్నర్‌తో సమావేశమయ్యారు.
 
అలాగే, డబ్ల్యూఈఎఫ్ వేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని సీఎం జగన్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలను చర్చించారు. అటు, మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
కాగా, ఈ దావోస్ పర్యటనలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఈడీబీ సీవీవో జీవీఎన్ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments