Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూటుకోటు ధరించి న్యూ గెటప్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్

Webdunia
ఆదివారం, 22 మే 2022 (20:28 IST)
దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కొత్త గెటప్‌లో కనిపించారు. సూటు, కోటు ధరించి టిప్‌టాప్‌గా రెఢీ అయ్యారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఇందులో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందానికి సీఎం జగన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై సీఎం జగన్ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. 
 
కాగా, సీఎం జగన్ తొలి రోజున బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన ఆయన వరుసగా అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా, బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్ బక్నర్‌తో సమావేశమయ్యారు.
 
అలాగే, డబ్ల్యూఈఎఫ్ వేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని సీఎం జగన్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలను చర్చించారు. అటు, మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
కాగా, ఈ దావోస్ పర్యటనలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఈడీబీ సీవీవో జీవీఎన్ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments