Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (15:16 IST)
పల్నాడు జిల్లాలో చిలీ సింగయ్య అనే వృద్ధుడి మృతి కేసులో వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంట్లపాడులో పర్యటించారు. ఆ సమంయలో ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద పడి సింగయ్య మృత్యువాతపడ్డాడు. ఈ మృతికి సంబంధించి జగన్ కారు డ్రైవర్‌ను మొదటి నిందితుడుగాను, రెండో నిందితుగా జగన్మోహన్ రెడ్డి పేరు, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైకాపా నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీలను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే జగన్ ప్రయాణించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు మిగిలిన వారంతా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపడుతామని హైకోర్టు తెలిపింది. జగన్ వాహనం కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించిన విషయం తెల్సిందే. సీసీటీవీ ఫుటేజీ, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు పరిశీలించినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments