Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లాలో మూలాపేట పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:11 IST)
శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరిక అయన మూలపేట పోర్టు నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా రూపు రేఖలు మారిపోవడమే కాకుండా సమగ్ర అభివృద్ధికి బాటలు వేయనుంది. సంతబొమ్మాళి మండలంలోని మూలాపేటలో రూ.4,362 కోట్ల వ్యయంతో ఈ పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. మత్తం 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తుల నిర్మాణం చేపడుతారు. ఈ నిర్మాణ పనులను 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. 
 
ఈ పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విష్ణుచక్రం, మూలాపేటలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.109 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేపడుతారు. బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.176.35 కోట్లత వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ.852 కోట్లతో మహేంద్ర తనయ అఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments