Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని వెన్నుపోటు? ఎలా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (10:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తేరుకోలేని షాకివ్వనుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయింది. 
 
అయితే, తమను ఓడించేందుకు బద్ధశత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలపడాన్ని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి ప్రతిఫలంగా రిటర్న్ గిఫ్టు ఇస్తానంటూ కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుహాసినిని తెరాస పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిను సుహాసినిని తెరాసలో చేర్చుకుని ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తెరాస శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒకింత షాక్‍‌కు గురై... ఇది నిజమా కాదా అనేదానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments