Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని వెన్నుపోటు? ఎలా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (10:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తేరుకోలేని షాకివ్వనుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయింది. 
 
అయితే, తమను ఓడించేందుకు బద్ధశత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలపడాన్ని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి ప్రతిఫలంగా రిటర్న్ గిఫ్టు ఇస్తానంటూ కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుహాసినిని తెరాస పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిను సుహాసినిని తెరాసలో చేర్చుకుని ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తెరాస శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒకింత షాక్‍‌కు గురై... ఇది నిజమా కాదా అనేదానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments