Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్న ఏపీ సీఎం జగన్

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (15:58 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. 
 
అక్కడ నుంచి ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ కూడా హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11 గంటల సమయానికి భీమవరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వీరిద్దరూ కలిసి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. 
 
మరోవైపు, ఆదివారం భీమవరంల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణమంతా వర్షపునీరు చేరిపోయింది. దీంతో రేపు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న అంశంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments