ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్న ఏపీ సీఎం జగన్

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (15:58 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. 
 
అక్కడ నుంచి ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ కూడా హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11 గంటల సమయానికి భీమవరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వీరిద్దరూ కలిసి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. 
 
మరోవైపు, ఆదివారం భీమవరంల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణమంతా వర్షపునీరు చేరిపోయింది. దీంతో రేపు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న అంశంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments