Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పోలవరానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి ఆయన పోలవరం పర్యటనకు వెళతారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అలాగే పునరావాస కాలనీ వాసులతో వారిద్దరూ మాట్లాడుతారు. ఈ మేరకు సీఎం జగన్ పోలవరం సందర్శనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 
 
కాగా, గురువారం రాత్రికి విజ‌య‌వాడ చేరుకున్న గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు జ‌గ‌న్ రాత్రి విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు - 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో జ‌గ‌న్‌, షెకావ‌త్‌లు మాట్లాడతారు.
 
ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments