వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అధికారుల ఎదుట ఏపీ సీఎంవో ఓఎస్డీ

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (14:36 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇపుడు వేగవంతమైంది. ఇటీవల వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వద్ద సీబీఐ విచారణ జరిపింది. ఈ విచారణ తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏ నవీన్‌‍లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
 
ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారుల శుక్రవారం ఎదుట హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ నోటీసుల నేపత్యంలో నవీన్ కూడా కడపకు చేరుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత నవీన్‌ను కూడా విచారించే అవకాశం ఉంది. 
 
కాగా, వివేహా హత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు అత్యధిక సంఖ్యలో కాల్స్ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో ఆయన. పులివెందుల ఓఎస్డీగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎంవోలో కీలక స్థానంలోకి వచ్చారు సీఎం జగన్‌కు వచ్చే కాల్స్ మొదట కృష్ణమోహన్ రెడ్డిని స్వీకరిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Legendary Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి లేదా కీర్తి సురేష్?

మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా పోలీస్ కంప్లైంట్ టీజర్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

Boyapati: అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా అఖండ 2 తాండవం : బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments