Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోడేళ్లు గుమికూడుతున్నాయ్... మీ బిడ్డ సింహంలా ఒంటరిగా వస్తున్నాడు... సీఎం జగన్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (16:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అదేసమయంలో అధికార వైకాపా మాత్రం ఒంటరిగా పోటీ చేయనుంది. దీనిపై ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు క్లారిటీ ఇచ్చారు. 
 
పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జగనన్న చేదుడో వాదోడు పథకం కింద అర్హులైన లబ్దిదారులకు నగదు పింపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ  సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, తాను ఎవరినీ నమ్మనని, తనకు పొత్తులు లేవని స్పష్టం చేశారు. దేవుడి దయ, అందరి దీవెనలే తన ఆస్తి అని అన్నారు. 
 
తోడేళ్లు ఒకే చోట గుమిగూడుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒంటరిగా ఎదురు చూస్తున్నా.. ఇంకా ఎలాంటి భయం కనబరచకుండా.. రాష్ట్ర ప్రజలపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగడమే ఇందుకు కారణమని జగన్ వ్యాఖ్యానించారు.
 
వచ్చే ఎన్నికల్లో మరోమారు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు. తనకు మేలు చేసేలా మరిన్ని అవకాశాలు కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా అని జగన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments