Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలంటీర్ అంటేనే సేవ చేయడం.. సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇంటి వద్దకే చేరవేసేందుకు గ్రామ వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కానీ, వలంటీర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. 
 
ఈ క్రమంలో వలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పనిచేసేవారని అర్థమన్నారు. కానీ, దానిని మార్చేసి ఇంకా ఆశించడం అంటే మొత్తం వ్యవస్థనే నీరుగార్చినట్టు అవుతుందన్నారు. 
 
వలంటీర్లను ప్రోత్సహించేందుకు ఉగాది రోజున సత్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తనకు ఈ ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఉగాది రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ వలంటీర్లకు సత్కారం చేయాలని ప్రభుత్వ కార్యదర్శులను సీఎం జగన్‌ ఆదేశించారు. 
 
వారికి సేవారత్న, సేవామిత్ర బిరుదులను ఇవ్వాలన్నారు. ఇలా చేయడంవల్ల వలంటీర్ల సేవలను గుర్తించినట్లు, ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. కాగా, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వలంటీర్లకు కూడా ఇదే హితబోధ చేశారు. తప్పుడు మాటలు విని చెడిపోవద్దంటూ వలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments