Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలంటీర్ అంటేనే సేవ చేయడం.. సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇంటి వద్దకే చేరవేసేందుకు గ్రామ వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కానీ, వలంటీర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. 
 
ఈ క్రమంలో వలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పనిచేసేవారని అర్థమన్నారు. కానీ, దానిని మార్చేసి ఇంకా ఆశించడం అంటే మొత్తం వ్యవస్థనే నీరుగార్చినట్టు అవుతుందన్నారు. 
 
వలంటీర్లను ప్రోత్సహించేందుకు ఉగాది రోజున సత్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తనకు ఈ ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఉగాది రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ వలంటీర్లకు సత్కారం చేయాలని ప్రభుత్వ కార్యదర్శులను సీఎం జగన్‌ ఆదేశించారు. 
 
వారికి సేవారత్న, సేవామిత్ర బిరుదులను ఇవ్వాలన్నారు. ఇలా చేయడంవల్ల వలంటీర్ల సేవలను గుర్తించినట్లు, ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. కాగా, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వలంటీర్లకు కూడా ఇదే హితబోధ చేశారు. తప్పుడు మాటలు విని చెడిపోవద్దంటూ వలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments