Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్‌లో బిజీగా గడుపుతున్న ఏపీ సీఎం జగన్

Webdunia
సోమవారం, 23 మే 2022 (13:31 IST)
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రెండో రోజైన సోమవారం బిజీగా గడుతున్నారు. ఈ సదస్సులో భాగంగా ఆయన ఆదివారం ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించి పలువురు కీలక పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. 
 
రెండో రోజైన సోమవారం కూడా మరికొందరు పెట్టుబడిదారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకునిరావడమే లక్ష్యంగా ఆయన అక్కడ కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీలు సీఈవోలతో సమావేశమవుతున్నారు. 
 
అలాగే, ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ అంశంపై సదస్సులో ఆయన మాట్లాడనున్నారు. స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం ఇది ఉద.యం 8.15 గంటలకు ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆయన టెక్ మహీంద్రా ఛైర్మన్, సీఈవో సీపీ గురానీతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత దస్సాల్ట్ సీఈవో బెర్నార్డ్ ఛార్లెస్‌తోను, ప్రముఖ రవాణా సంస్థ ఓస్కే లైన్స్ లిమిటెడ్ సీఈవో తకేషి హషిమొటోతో భేటీ అవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments