Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం అబ్జెక్షన్ నీది? రోషం లేనోళ్లమా..? ఎవరికి ఊడిగం చేస్తారు?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (19:17 IST)
ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా తన ప్రసంగానికి అడ్డు తగిలిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆ సమయంలో అబ్జక్షన్ అంటూ విష్ణుకుమార్ రాజు అనగానే చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 
 
ఊడిగం చేస్తున్నారా రాష్ట్రంలో అంటూ అడిగారు. ఎవరికి ఊడిగం చేస్తారు. అడిగేవారు లేరని మీ ఇష్టప్రకారం చేస్తారా? ఏం చేస్తారయ్యా మమ్మల్ని? జైలులో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం.. ఆవేదన వుండదా? ఏపీకి ఏమిచ్చారయ్యా..? తమిళనాడు, గుజరాత్‌కు ఏమిచ్చారో తెలుసుకోవాలి. పోల్చి చూడండి. కొత్త రాష్ట్రమొస్తే సపోర్ట్ చేసేదిపోయి.. ఇబ్బందులు పెడుతున్నారా.. రోషం లేనోళ్లమా.. అంటూ బీజేపీ ఎమ్మెల్యేలపై చిందులేశారు.
 
అయినా అబ్జెక్షన్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా..? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు" అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments