Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో 30 రైల్వే స్టేషన్ల మూసివేత: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (13:11 IST)
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమ జోన్ పరిధిలో మొత్తం 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతపడతాయని, ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూసివేస్తామని అధికారులు వెల్లడించారు.
 
అయితే ఈ స్టేషన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది. డివిజన్ల వారీగా చూస్తే సికింద్రాబాద్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1, గుంటూరులో 4, హైదరాబాద్ పరిధిలో 7 స్టేషన్లను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. 
 
ఉన్నట్టుండి 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments