Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను ట్రాప్ చేయడంలో గుంటూరు జిల్లా పోలీసులే టాప్

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (20:00 IST)
మహిళలను ట్రాప్ చేసి, తమ వలలో వేసుకుని వారితో రాసలీలలు సాగించడంలో గుంటూరు జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలతో పోల్చితే ఈ తరహా సంఘటనలు ఒక్క గుంటూరు జిల్లాలోనే అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా వరుస సంఘటనలతో పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా, బాధిత మహిళలు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నారు. 
 
తాజాగా గుంటూరు జిల్లాలో మోడల్ పోలీస్ స్టేషన్‌గా మార్చిన నగరపాలెం పోలీసు స్టేషన్‌లో వెంకట రెడ్డి సీఐగా విధులునిర్వహిస్తున్నారు. అక్కడకు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళను ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు ఆమెను అన్ని రకాలుగా వాడుకుని చివరికి వదిలేశాడు.
 
సీఐ చేతిలో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ... జిల్లా అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గుంటూరు రేంజి ఐజీ ఆదేశాల మేరకు ఈ అంశంపై ఎస్పీ విచారణ చేపట్టగా, అందులో సీఐ నిజస్వరూపం బహిర్గతమైంది. దీంతో వెంకటరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లాలో కొంతకాలం నుంచి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
గతంలో జిల్లాలోని అరండల్‌పేట ఎస్ఐ బాలకృష్ణ వ్యవహారం కూడా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఎస్ఐ బాలకృష్ణతో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. 
 
అలాగే, మరో ఎస్ఐ కూరపాటి నాగేంద్ర కూడా తనను లైంగికంగా వేధించారని ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయమైన ఎస్ఐ లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా బాధితురాలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇంకా విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం