Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది మేమే.. ఆల్‌ఖైదా పేరుతో లేఖ

చిత్తూరు కోర్టులో బాంబు పేల్చింది మేమేనంటూ ఆల్‌ఖైదా పేరుతో ఒక లేఖ కోర్టుకు వచ్చింది. లేఖపై ది డేస్‌ మూవ్‌మెంట్‌ అంటూ ఉంది. లేఖను తీసుకున్న కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నిరోజులకు ముందు కోర్టులోని వాహనాల పార్కింగ్‌ ఆవరణలో బాంబు ప

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (22:10 IST)
చిత్తూరు కోర్టులో బాంబు పేల్చింది మేమేనంటూ ఆల్‌ఖైదా పేరుతో ఒక లేఖ కోర్టుకు వచ్చింది. లేఖపై ది డేస్‌ మూవ్‌మెంట్‌ అంటూ ఉంది. లేఖను తీసుకున్న కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నిరోజులకు ముందు కోర్టులోని వాహనాల పార్కింగ్‌ ఆవరణలో బాంబు పేలిన విషయం తెలిసిందే.
 
బాంబు పేలిన సంఘటనలో కోర్టులో విధులు నిర్వహించే ఒక అటెండర్‌ కాలికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. పాతకక్ష్యలతో చింటూను చంపేందుకే ప్రత్యర్థులు బాంబు పెట్టారని ముందుగా అందరూ భావించారు. అయితే ఒక లేఖ ఆల్‌ఖైదా పేరుతో రావడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. 
 
లేఖపై ఎలాంటి చిరునామా లేకపోవడంతో ఆకతాయిలు ఎవరైనా రాసి ఉంటారా..లేకుంటే నిజంగానే ఉగ్రవాదులు రాశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు కోర్టును పేల్చాల్సినంత అవసరం ఉగ్రవాదులకు లేదని, ఇది మొత్తం పాతకక్ష్యల వల్లేనని పోలీసులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments