Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టులో హత్య.. కడపలో శిక్ష.. ఎలా జరిగింది?

దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (11:45 IST)
దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లా కేవీ.పల్లెకు చెందిన నాగమునెమ్మ అలియాస్‌ నాగమణి (45) జీవనోపాధి కోసమని కొన్నేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈజిప్టులో ఆమెకు తెలిసిన వారు ఉంటే గల్ఫ్‌ నుంచి ఈజిప్టు దేశానికి వచ్చింది. అక్కడ ఆమె ఓ హత్య కేసులో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంది. 
 
దీంతో ఆమెను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించారు. కానీ ప్రస్తుతమున్న చట్టాల్లో వెలుసుబాటు వల్ల నిందితురాలు సొంత ఊళ్లొనే జైలు శిక్ష అనుభవించవచ్చు. 
 
ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ముద్దాయి తరపు న్యాయవాది తీసుకెళ్లడంతో ఈజిప్టు కోర్టు మన్నించి చిత్తూరు జైల్లో శిక్ష అనుభించేందుకు సమ్మతించింది. దీంతో ఆమె చిత్తూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఆమె 2025లో విడుదలవుతారని జైలు అధికారులు తెలిపారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments