Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఫిక్స్.. వరుడు కాదు పొమ్మన్నాడు.. అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (09:35 IST)
అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంకా ఆమెకు పెళ్లి జరగాల్సి వుంది. ఇంతలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం 3 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమారుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురై అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. 
 
చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. పూతలపట్టు మండలం బందార్ల పల్లె గ్రామానికి చెందిన మురళి కుమారుడు భరత్ అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరి కుటుంబసభ్యులు చర్చించుకుని పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెద్దలు ఈ నెల 3వ తేదీన ఉదయం 3 గంటలకు వివాహం ఖాయం చేశారు. శుభలేఖలు కూడా ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. 
 
కానీ వారం రోజుల క్రితం యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయంపై సుష్మ, భరత్ మధ్య పంచాయతీ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. అయితే అంతా సర్దుకుంటారని అనుకున్నారు. కానీ చివరకు తన కుమార్తె మృతి చెందిందని వచ్చిన వార్తతో అవాక్కయ్యారు.
 
పెళ్లికి భరత్ నిరాకరించడంతోనే సుష్మా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభలేఖలు ముద్రించి పెళ్లి రోజున ఇలాంటి ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తమను కలచివేసిందని వాపోయారు. తమకు న్యాయం చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments