Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఫిక్స్.. వరుడు కాదు పొమ్మన్నాడు.. అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (09:35 IST)
అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంకా ఆమెకు పెళ్లి జరగాల్సి వుంది. ఇంతలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం 3 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమారుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురై అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. 
 
చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. పూతలపట్టు మండలం బందార్ల పల్లె గ్రామానికి చెందిన మురళి కుమారుడు భరత్ అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరి కుటుంబసభ్యులు చర్చించుకుని పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెద్దలు ఈ నెల 3వ తేదీన ఉదయం 3 గంటలకు వివాహం ఖాయం చేశారు. శుభలేఖలు కూడా ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. 
 
కానీ వారం రోజుల క్రితం యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయంపై సుష్మ, భరత్ మధ్య పంచాయతీ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. అయితే అంతా సర్దుకుంటారని అనుకున్నారు. కానీ చివరకు తన కుమార్తె మృతి చెందిందని వచ్చిన వార్తతో అవాక్కయ్యారు.
 
పెళ్లికి భరత్ నిరాకరించడంతోనే సుష్మా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభలేఖలు ముద్రించి పెళ్లి రోజున ఇలాంటి ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తమను కలచివేసిందని వాపోయారు. తమకు న్యాయం చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments