Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లా తవణంపల్లెలో యువతి దారుణ హత్య

Webdunia
సోమవారం, 2 మే 2016 (10:53 IST)
చిత్తూరు జిల్లా నేరాలకు కేంద్రబిందువుగా మారిపోతోంది. రోజుకో హత్య, అత్యాచారాలు ఈ జిల్లాలో జరుగుతుండటంతో జిల్లా వాసులను భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లెలో మరో దారుణం జరిగింది. తవణంపల్లె మండలం కొంగారెడ్డిపల్లెకు చెందిన నజీర్‌ కుమార్తె ఆసియా (25) బెంగుళూరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేస్తోంది. 
 
రెండు రోజుల క్రితం సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఆసియా ఆదివారం అర్థరాత్రి ఇంటి నుంచి బెంగుళూరు బయలుదేరింది. అయితే సోమవారం తెల్లవారుజామున మైనగుండ్లపల్లె మలుపు సమీపంలోని ఓ ఇంటిలో ఆసియా ఉరేసుకుని చనిపోయి ఉంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆసియా మృతదేహం వద్ద పోలీసులు పరిశీలించగా ఆమె శరీరంపై గాయాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా చంపి ఉరేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో పోలీసులు హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments